Thursday, 30 July 2026 11:04:13 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి

Date : 14 April 2026 03:50 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మైభారత్ అన్నమయ్య సంస్థ వారి ఆధ్వర్యంలో డాక్టర్‌ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, యెన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ పి.రాజేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు మన అంబెడ్కర్ అని తెలిపారు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని, ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు అని, ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి అన్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని నెమరేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువత తరాలు ఆయన ఆశయాలను ఆకళింపు చేసుకుని, సమానత్వం, బౌద్ధికత, మానవత్వం వంటి విలువలను తమ జీవితాల్లో అనుసరించాలి. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో యన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ రాజేష్, యన్.సి.సి 11 ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు యన్.ఎస్.ఎస్. మరియు యన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: