నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద తేలికపాటి వర్షాలకే నీటి మడుగులు ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రతినిత్యం ఎంపీడీవో కార్యాలయం లో వెలుగు, ఉపాధి హామీ, హౌసింగ్ శాఖల కార్యాలయాలు ఉండి వందలాదిగా అధికారులతో పాటు ప్రజలు హాజరవుతుంటారు. కార్యాలయం ముందే నీటిమడుగు ఉండడంతో లోపలికి వెళ్లడానికి వారు పడే పాట్లు వర్ణనాతీతం. అయినా మాకెందుకులే అని అధికారులు, ప్రజా ప్రతినిధులు పక్కకు తప్పుకొని పోవడం విశేషం. మండల పరిషత్ కు పలు రకాల నిధులు మంజూరైన కార్యాలయం ముందు నీటిమడుగు మరమ్మత్తులకు నిధులు కేటాయించకపోవడంపై ప్రజలు విస్తు పోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నీటి మడుగు లేకుండా చర్యలు చేపట్టకపోతే అభాసుపాలు కావడం ఖాయం
Reporter
Namitha News