నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబరు 29 : తంబళ్లపల్లె యస్.ఐ. అనిల్ కుమార్ ను తంబళ్లపల్లె మండల బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం ఉదయం ఎస్సై అనిల్ కుమార్ ను దుశ్యాలవులు, పూల మాలలతో సన్మానించి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. దీనిపై ఎస్ఐ అనిల్ కుమార్ వారిని అభినందించి ప్రతి ఒక్కరు మండలంలో నేర రహిత సమాజం కోసం పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు వెంకటరమణ, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రామస్వామి రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, యుగంధర్, కొటాల మల్లికార్జున, మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News