నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 20 ః తంబళ్లపల్లె మండలం లోని రైతులకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రూ 5.57 కోట్లు రైతుల ఖాతాలో జమైనట్లు ఎంపీఈఓ లు సురేష్, రెడ్డిశేఖర్, సుధాకర్ లు తెలిపారు. మండలంలోని 8973 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో 5000 చొప్పున రూ 4.14 కోట్లు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 2000 చొప్పున రూ 1.43 కోట్లు నిధులు విడుదలైనట్లు చెప్పారు. ఇంకా రైతుల ఖాతాలో రైతు భరోసా పడని రైతులు తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వారు విలేకరులకు తెలిపారు.
Reporter
Namitha News