Friday, 31 July 2026 07:35:29 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గొల్లపల్లి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు, టైల పంపిణి

Date : 10 November 2025 06:55 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం మండలం గొల్లపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాల లోని 55 మంది విద్యార్థులకు సోమవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మరియు పాఠశాల కమిటీ సభ్యుడు పురుషోత్తం సంయుక్తంగా స్వంత నిధులతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు, టైలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలకు మరియు ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, కమిటీ సభ్యుల సహకారం ఎంతైనా అవసరమని, ఈ పాఠశాలలోని పిల్లల అభివృద్ధి బాగుందని ఉపాధ్యాయులను కొనియాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ గొల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షాహిరా ,చోకాండ్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, గొల్లపల్లి ఉపాధ్యాయురాలు రెడ్డినీలాంబ, పాఠశాల కమిటీ చైర్మన్ నాగభూషణం, సభ్యులు అమరప్ప, సుజ్ఞానమూర్తి, చస్మా, ఉపాధ్యాయులు చిన్న రెడ్డప్ప , రామన్న తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :