నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 24 : తంబళ్లపల్లి మండలంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీల ఇంటి పన్ను వసూలు, మౌలిక సదుపాయాల కల్పనలో ముగ్గురు పంచాయతీ ఉత్తమ అభివృద్ధి అధికారులుగా ఎంపికైనట్లు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు అందాయి. తంబళ్లపల్లె పంచాయతీ కార్యదర్శి బి.శ్రీనివాసరావు, గోపి దిన్ని పంచాయతీ కార్యదర్శి ఎం.నాగ పద్మజ, పరస తోపు పంచాయతీ కార్యదర్శి ఎం. హరి ప్రసాద్ ల ఎంపికపై మండల పరిషత్ అధికారులు, కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది, మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ మెంబర్లు,ఎంపీటీసీలు, అధికార కూటమి పార్టీల నాయకులు వారు చేసిన సేవను కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు
Reporter
Namitha News