Thursday, 30 July 2026 12:02:17 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళా వాకథాన్‌ లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం

Date : 08 March 2026 06:31 PM Views : 317

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 'మహిళా వాకథాన్' వేడుకలు అంబరాన్నంటాయి. మహిళా శక్తిని చాటేలా, వారి భద్రత పట్ల అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మిషన్ కాంపౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మహిళలతో కలిసి అడుగులేసిన ఎస్పీ కేవలం జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించడమే కాకుండా, స్వయంగా ఎస్పీ గారు మహిళా పోలీసు సిబ్బంది, విద్యార్థినులు మరియు స్థానిక మహిళలతో కలిసి సుమారు 2 కిలోమీటర్ల మేర నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ వాకథాన్‌లో ఎస్పీ గారు మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళల నినాదాలతో మదనపల్లి వీధులు మార్మోగాయి. మహిళలను ఏడిపిస్తున్న ఆకతాయిలను ఎలా ఎదుర్కోవాలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు చేసిన నాటక ప్రదర్చన ఎంత గానో ఆకట్టుకుంది

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం అంటూ ర్యాలీ అనంతరం బి.టి. కళాశాల పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ గారు ప్రసంగిస్తూ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పోలీసు శాఖ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. "మహిళలకు ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. "నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ శక్తినైనా అణిచివేసేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. శక్తి టీమ్స్, శక్తి యాప్ మరియు 112 నంబర్ సేవలను ప్రతి మహిళా వినియోగించుకోవాలి. మీ రక్షణ కోసం మేము నిరంతరం పహారా కాస్తాము." అని పేర్కొన్నారు.

విజేతలకు ప్రోత్సాహం బహుమతులు అందచేసిన ఎస్పీ ఈ వాకథాన్‌లో ఎంతో చురుగ్గా పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్న మహిళలలో 10 మందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి జ్ఞాపికలను, బహుమతులను అందజేస్తూ, వారిలోని స్ఫూర్తిని కొనియాడారు. బహుమతులు అందుకున్న వారిలో విద్యార్థినులతో పాటు గృహిణులు కూడా ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, పలువురు సీఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసులు మరియు పట్టణ వాసులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :