నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 09 : అన్నమయ్య జిల్లాలోని రామసముద్రం మండలం వూలపాడు పంచాయతీ దిన్నిపల్లె గ్రామ పరిధిలోని కొండమొరులో ప్రాచీన గవి తిమ్మరాయ స్వామి దేవాలయం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. గౌతమ మహర్షి తపస్సు చేసిన గవిలో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉద్భవమూర్తిగా వెలసినట్లు పురాణం చెబుతోంది. సహజ గవిలో కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రావణ మాసంలో జరిగే ప్రత్యేక పూజలు, సేవలు భక్తులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని తమ ఇంటి దేవుడిగా ఆరాధిస్తున్నారు.
Reporter
Namitha News