Friday, 31 July 2026 12:53:47 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లో అవుట్‌ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై జాతీయ వర్క్ షాప్

Date : 05 December 2025 08:51 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకుల కోసం “అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE)” పై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యా నాణ్యతను పెంపొందించడంలో ఎన్.బి.ఏ మరియు న్యాక్ గుర్తింపు ఎంతో కీలకమని, ఎన్.బి.ఏ ప్రధానంగా టెక్నికల్ ప్రోగ్రామ్‌లకు అక్క్రిడిటేషన్ ఇస్తూ, కోర్సులు అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్నాయా అనే అంశంపై దృష్టి పెడుతుంది అని అన్నారు. న్యాక్ గుర్తింపు మాత్రం మొత్తం సంస్థ పనితీరును అంచనా వేసి, పాఠ్య ప్రణాళిక, బోధన-అభ్యాసం, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు వంటి అంశాలను పరిశీలించి రేటింగ్ ఇవ్వడం ద్వారా అక్క్రిడిటేషన్ పొందిన కళాశాలలకు పరిశ్రమలతో అనుబంధం పెరగడం, ఉద్యోగావకాశాలు మెరుగు పడడం, ప్రభుత్వ నిధులు పొందే అవకాశం పెరగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియడం ద్వారా బోధనా నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు బోధనా విధానాల్లో నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల నేర్పుదల పద్ధతులు, కోర్స్ అవుట్‌కమ్, ప్రోగ్రామ్ అవుట్‌కమ్ రూపకల్పన, అకడమిక్ అక్వాలిటీ మెరుగుదల వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల నుండి 80 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :