నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 20 : రామసముద్రం మండలం లోని గ్రామ పంచాయతీ లలోని అన్నీ గ్రామాల్లో పారిశుధ్యం మంచినీటి సరఫరా పై శ్రద్ధ చూపి ఫిఫ్టీంత్ ఫైనాన్స్ నిధులు సింహ భాగం వీటిపైనే ఖర్చు చేయాలని ఎంపీడీఓ లతీఫ్ ఖాన్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం గురువారం ఏర్పాటు చేసి సర్పంచ్ ల సమావేశంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా అడుగులు వేయాలని,ఈ ఏడాది కి సంబంధించి అర్. జి.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక గ్రామ స్వరాజ్యం స్థాపన లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని ఎంపీడీఓ సర్పంచ్ లను కోరారు.శుక్ర , శనివారాలలో సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి అర్.జి.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక ఫై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం ఎంపీడీఓ సర్పంచ్ లతో కలసి అర్.ఫై.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక బ్యానర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గపూర్, బిసి నాయకులు గెవన్న, సర్పంచ్ లు రెడ్డెప్ప నాయుడు, తిప్పరాజు,కొండూరు శ్రీనాథ్ రెడ్డి,ఉదయ్ శంకర్ రెడ్డి, కేసీ పల్లె శ్రీనివాసులు రెడ్డి,రాధారెడ్డి,ఇంజం వెంకటరమణ,జీకే చంద్ర సుభాష్ బాలప్ప నారాయణ పంచాయతీ సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News