Monday, 03 August 2026 06:08:12 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం

Date : 19 April 2026 06:17 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. కబడ్డీ క్రీడా పోటీలను అన్నమయ్య జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నరేష్ బాబు, బిజెపి ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, రన్ టీవీ డైరెక్టర్ సిరివేలు చరణ్ కుమార్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, కబడ్డీ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ క్రీడా పోటీలలో జిల్లా నలుమూలల నుండి అండర్ 14, 17, 19 విభాగాలలో బాలబాలికల క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని ప్రతిభ చూపారు. అండర్ 14 విభాగంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు, అండర్ 17 విభాగంలో కలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అండర్ 19 విభాగంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, రాష్ట్ర కురుబ సంఘం డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాటకొండ గురు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి చురుగ్గా క్రీడల్లో పాల్గొంటారని, ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్ పోటీలలో కబడ్డీ క్రీడను కూడా చేర్చాలని, అందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి క్రీడాకారులు పాల్గొనేలా శిక్షణ తీసుకోవాలని తెలిపారు. విజేతలైన క్రీడాకారులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. క్రీడాకారుల బహుమతులను జివీఎస్సిఎస్ సొసైటీ ఫౌండర్ జి.శ్రీధర్ కుమార్ సమకూర్చారని అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సభ్యులు శ్రీకాంత్, రమేష్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ మిమిక్రీ రామమూర్తి, క్రీడాభారతి మదనపల్లె శాఖ అధ్యక్షులు బాలాజీ, షూటింగ్ బాల ఆసియన్ గోల్డ్ మెడలిస్ట్ యూసఫ్ బాషా, క్రీడా భారతి సభ్యులు మురళి, కిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ, లత, భారతి, శరత్, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: