Thursday, 30 July 2026 06:08:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

కోళ్లబైలు లో రూ.4.5 కోట్లతో 39 రోడ్లు ఏర్పాటు కోళ్లబైలు ఇన్చార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు

Date : 08 November 2025 04:32 PM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్ 8: అభివృద్ధి సంక్షేమానికి టిడిపి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కోళ్లబైలు పంచాయతీలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరిగాయని కోళ్లబైలు టిడిపి ఇన్ ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోళ్లబైలు పంచాయతీలో 14 వేలకు పైగా జనాభా ఉన్నారని, 5 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారని, అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు.‌ ఒక్క రోడ్డు వేయలేదని కాలువ నిర్మించలేదని విమర్శించారు. టిడిపి కూటమి సర్కార్ అధికారం చేపట్టిన 16 నెలల్లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష కోళ్లబైలు పంచాయతీ పై ప్రత్యేక దృష్టి సారించి రూ. 4.5 కోట్ల నిధులతో 39 రోడ్లను వేయించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కోళ్లబైలులో 12 వీధులకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా తమ ప్రభుత్వం లో నిధులు కేటాయించామని వైసీపి నేత నిస్సార్ అహ్మద్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ ను తామే తెచ్చామని వైసీపి అధ్యక్షుడు జగన్ చెప్పుకుంటున్నట్లు నిస్సార్ అహ్మద్ మతిభ్రమించి తామే నిధులు కేటాయించామని డప్పు కొట్టుకుంటున్నారన్నారు.‌ వైసిపీ హయాంలో నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం వంద ఇళ్లు మంజూరు చేస్తే 200 ఇంటి స్థలాలు ఆక్రమించుకున్నారన్నారు. నిసార్ అహ్మద్ కు చిత్తశుద్ది ఉంటే వైసీపి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్థానిక సంస్థల‌ ఎన్నికలలో వైసిపి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలిమాలి శేఖర్ రాయల్, రెడ్డిశేఖర్, జివి నాయుడు, శ్రీనాథ్, రామచంద్ర, స్నేహ మెడికల్స్ రమేష్, మోహన్ రెడ్డి, అంజి,తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :