నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 17 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిషన్స్) మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వి మారుతి ప్రసాద్ కు తమిళనాడు రాష్ట్రము లోని చెన్నైలో గల సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారు డాక్టర్ పట్టాను అందజేసినట్లు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగము నుండి పిహెచ్డి డిగ్రీ పొందినట్లు, అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ బి. భారతి పర్యవేక్షణలో "యాన్ ఇంటెలిజెంట్ మల్టీమోడల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎమర్జింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఐఓటి" అను అంశం పై చేసిన పరిశోధన కు గాను డాక్టర్ పట్టా ను అందజేసినట్లు ఆయన అన్నారు. వి.మారుతీ ప్రసాద్ ను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలియజేసారు.
Reporter
Namitha News