నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - నవంబర్ 30 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాదరవలియా నాగూర్ మీరా స్వామి వారి దర్గా 95వ గంధమహోత్సవం నేడు ఘనంగా నిర్వహించారు.. దర్గాలో ప్రత్యేక పూజ నిర్మించేందుకు ఫాతిహా సామాగ్రిని చేజెర్ల మండలం ఆంధ్రప్రభ విలేఖరి నజీర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి గొప్ప మేళతాళాలతో పకీరుల వాయిద్యాలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొని వచ్చారు. దర్గాలో పూజా సామాగ్రిని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ప్రత్యేక దువా అనంతరము భక్తులకు ప్రసాదం పంచి అనంతరం దర్గా వద్ద అన్నదానం నిర్వహించారు..నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు... ఈ గంట మహోత్సవకార్యక్రమంలో అన్నదానంతోపాటు దర్గాకు భారీ పూలంకరణలను కూడా నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనంద రెడ్డి సంయుక్తంగా వారి సొంత ఖర్చులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేజర్ల ఎస్సై తిరుమలరావు ప్రత్యేక అతిథిగా విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు ప్రజలు భారీగా పాల్గొన్నారు
Admin
Namitha News