Thursday, 30 July 2026 07:27:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ లో జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26

Date : 26 February 2026 07:30 PM Views : 299

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి -ఫిబ్రవరి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26 (ఎపిచ్స్-2026) ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యాశ్పాల్, సీనియర్ మేనేజర్, ఏ.టి&టి కంపెనీ, బెంగళూరు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల పెరుగుదల, డేటా భద్రత, ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి అని అన్నారు. నకిలీ ఈమెయిల్లు, బ్యాంక్ లేదా కంపెనీల పేరుతో వచ్చే లింకులు ద్వారా వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు దొంగిలించడం జరుగుతోంది. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రజల ఖాతాల నుంచి డబ్బును ఊహించలేని విధంగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఆధునిక సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాకుండా ప్రముఖుల్నీ సైతం మోసం చేస్తున్న అనేక ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైబర్ భద్రతపై విస్తృత అవగాహన అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం రక్షణ, పాస్‌వర్డ్ భద్రత, రెండు-దశల ధృవీకరణ, సురక్షిత బ్రౌజింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న ఉద్యోగావకాశాలు, ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ భద్రతకు ఉన్న అవసరం మరింత పెరుగుతోందని, పరిశ్రమ అవసరాలకు తగినట్లు విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యకమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి.పెరిసిస్ అర్బన, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్స్ డాక్టర్ సచికంఠ దాస్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ రోని దాస్, శ్రీ లక్ష్మి ప్రీతీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: