నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జూన్ 05 : రామసముద్రం మండల లోని కుదురుచీమనపల్లిలో ఎరువుల దుకాణం లో వ్యవసాయ శాఖ తో పాటు విజిలెన్స్ శాఖ అధికారులు లక్ష్మణ్ కుమార్, రామయ్య లు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో భాగంగా దుకాణం లోని స్టాక్ రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించగా నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లెక్కలు లేకుండా నిల్వ ఉంచిన 6.85 మెట్రిక్ టన్నుల ఎరువులను అధికారులు గుర్తించారు. షాప్ కు సంబందించిన 'O' ఫారం కూడా గడువు ముగిసిందని దానిని కూడా రెన్యూవల్ చేసుకోవాలని, సుమారు రూ.2.65 లక్షల విలువైన ఈ ఎరువుల నిల్వలను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించామని తెలిపిన రామసముద్రం వ్యవసాయ శాఖ అధికారి జాఫర్ తెలిపారు
Reporter
Namitha News