నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సదుం - ఏప్రిల్ 10 : సదుం జాండ్రపేట లో వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద రెడ్డెమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె మధ్యాహ్నం నిద్రిస్తుండగా ఎవరో తలుపు తట్టడంతో లేచి తలుపు తీయగా బురఖా ధరించిన వ్యక్తి మొహంపై కారం కొట్టి మెడలో నున్న 25 గ్రాముల బంగారు చైను లాక్కొనివెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Reporter
Namitha News