Saturday, 18 April 2026 03:58:09 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు

Date : 17 April 2026 07:49 PM Views : 7

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు ఉపాధి అవకాశాలను పెంచి వలసలను నివారించడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ప్రారంభమైన అన్నమయ్య జిల్లా మొదటి మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలకు మండం సుధీర్ కుమార్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలు వ్యవసాయ కార్మికులుగా జీవనం సాగిస్తున్నాయని, వీరంతా భూమిలేని నిరుపేదలేనని తెలిపారు. శారీరక కష్టాన్ని ఆధారంగా చేసుకుని జీవించే ఈ వర్గానికి భూపంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ కూలీలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మార్చే ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని, గతంలో 10 శాతం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పుడు 40 శాతం భారం రాష్ట్రాలపై పడుతోందన్నారు. కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇవ్వడం, అవి కూడా ఆలస్యంగా విడుదల కావడం వల్ల పథకం అమలు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం కొనసాగితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ల్యాండ్ సీలింగ్ చట్టం అమలులో ఉన్నప్పటికీ భూస్వాముల సంఖ్య పెరుగుతోందని, పాలకవర్గాలే భూస్వాములుగా మారుతున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని, ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం సంఘం శక్తివంచన లేకుండా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు హరి శర్మ సంఘీభావం ప్రకటిస్తూ వ్యవసాయ కార్మికులకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ప్రతినిధులు మహాసభల్లో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :