Friday, 31 July 2026 11:32:25 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

పీలేరు సిఐ యుగంధర్ మహిళా అధికారిపై ప్రవర్తించిన తీరు హేమమైన చర్య - తోపు కృష్ణప్ప సిపిఐ జిల్లా సంయుక్త కార్యదర్శి

Date : 25 February 2026 08:30 PM Views : 257

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 25 : పీలేరు సీఐ యుగంధర్ మహిళా అధికారిణి సునీత పై దుర్మార్గంగా, అహంకారంగా ప్రవర్తించి "కేసులు పెడతాను" అని బెదిరించడం అతి దారుణం, మహిళా హక్కులపై కాలక్రమంగా జరుగుతున్న దాడి.ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.నిన్న పీలేరులో చిత్తూరు నేషనల్ హైవే డివిజనల్ ఇంజనీర్ సునీతపై సీఐ యుగంధర్ ప్రజల ముందు అవమానకరంగా వ్యవహరించారు. బ్రిడ్జ్ పనుల ఆలస్యంపై వాదనలో పై అధికారిని అని చూడకుండా , కన్నీరు తెప్పించారు—ఇది పోలీసు వ్యవస్థలోని కట్టుబాటు లోపాలను తెలియజేస్తుందన్నారు . పీలేరు మదనపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఆర్‌వోబీ నిర్మాణ పనుల సమీక్షలో సీఐ యుగంధర్ సునీతను పబ్లిక్‌లో లక్ష్యంగా చేసుకుని బెదిరించారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పకుండా, మహిళా అధికారిణిని అవమానించడం మానవత్వ విరుద్ధం. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైనా, సమస్యలు అధికారికంగా పరిష్కరించాలి అలాకాకుండా రోడ్డుమీద మహిళను అవమానపరిచి ఆమెను ఏడిపించడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు . మహిళా అధికారిణులను రక్షించాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజలు కు ఏమవుతారు? ఈ ఘటన మహిళా హక్కులపై దాడి—పోలీసు అధికారుల అహంకారానికి అవసరమైన పాఠం. సిపిఐ ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పోరాడుతుంది. ఫ్లైఓవర్ ఆలస్యానికి కారణాలు సమగ్రంగా తెలుసుకోకుండా ఒక మహిళను బాధపెట్టి ఏమీ సాధించలేరు సీఐ పోలీసు యూనిఫాం ధరించి బాధ్యతలు మరచి, మహిళా అధికారిణిని పబ్లిక్‌లో అవమానించడం పోలీసు వ్యవస్థపై మచ్చలా మారుతోంది. ఇలాంటి బెదిరింపులు ప్రమాదాలకు దారితీస్తాయి—ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలోపెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తుందని, ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తామని తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు. మహిళల భద్రత, గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: