నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు , రామసముద్రం మండల జడ్పీటీసీ సభ్యుడు సిహెచ్. రామచంద్ర రెడ్డి చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం లో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో మండల జడ్పీటీసీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మండలం అభివృద్ధి పనుల పురోగతి, పథకాల అమలు, గ్రామీణ వసతుల పై అధికారులు నివేదికలు సమర్పించారు. మండల సమస్యలు, రహదారులు,నీటి అవసరాలు, ప్రజలకు చేరే సేవలపై ఆయన సూచనలు చేశారు. సమావేశంలో అధికారులతో రామచంద్ర రెడ్డి పలు అభిప్రాయాలు పంచుకున్నారు.
Reporter
Namitha News