Tuesday, 09 June 2026 09:37:27 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో భారీచోరీ... హుండీలు దోపిడీ, బంగారం, వెండి ఆభరణాలు చోరీ

కట్టర్లతో గేట్లు,తలుపులు ధ్వంసం చేసిన దొంగలు

Date : 24 February 2026 06:52 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో భారీచోరీ - కట్టర్లతో గేట్లు,తలుపులు ధ్వంసం చేసిన దొంగలు - రూ. 25 లక్షల నగదు,వెండి కిరీటాలు అపహరణ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో దొంగలు రెచ్చిపోయారు.ఏకంగా దేవుని గుడినే కొల్లగొట్టారు.అనపగుట్టలో కొలువున్న శ్రీకృష్ణుని ఆలయం తలుపులు,గేట్లను కట్టర్లతో ధ్వంసం చేసి రెండు హుండీలలోని నగదు,దేవుళ్ళ విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు బంగారు తాళి బొట్లు,ఇతర నగలు,నగదును దొంగలు దోపిడీ చేశారు.మంగళవారం ఉదయం శ్రీకృష్ణుని ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆలయ పూజారికి గుడిలో చోరీ జరిగిందని గుర్తించి వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు.వారు వెంటనే ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ మహమ్మద్ రఫీ ఎస్సై రహీముల్లా,శ్రీరాములు,సిబ్బంది హుటాహుటిన అనపగుట్టకు చేరుకుని కృష్ణుని ఆలయంలో చోరీ జరగడాన్ని పరిశీలించారు.విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లడంతో డాగ్ స్క్వాడ్,క్లూస్ టీంలను మదనపల్లికు పంపించారు.అనపగుట్టలోని కృష్ణుని ఆలయం వద్దకు చేరుకున్న జాగిలాలు,క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించి అణువణువు గాలించారు.దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు,అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఆలయంలో ఉన్న వాచ్‌మాన్ తన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం వెళ్లడం గమనించిన దొంగలు గ్యాస్ కట్టర్లు వినియోగించి తలుపులు కిటికీలను ధ్వంసం చేసి గుడిలో ఉన్న రెండు పెద్ద సైజు హుండీలను ధ్వంసం చేసి అందులోని నగదును పెద్ద మొత్తంలో అపహరించారు.అలాగే శ్రీకృష్ణుడి కిరీటం,సత్యభామ మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాలు,ఇతర దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు సుమారు రూ.25 లక్షలకు విలువైన నగలు నగదు అపహరించుకుపోయారు.చోరికి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా,దొంగలు శ్రీకృష్ణుని గుడిలో చోరీకి పాల్పడం బాధాకరమన్నారు.నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :