Thursday, 16 April 2026 03:18:33 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

గంజా కేసు లో పరారీ లో నున్న నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్, కేజీ గంజాయి స్వాధీనం.

గంజా విక్రయదారులపై పి.డి. అక్ట్ నమోదు చేస్తాం - అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 11 April 2026 08:38 PM Views : 66

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండీ లక్ష రూపాయలు విలువచేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

గతంలో నమోదైన ఉల్లిపాయల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసు పాత కేసులో పరారీలో ఉన్న నలుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఈ నిందితులను శనివారం బసినికొండ పంచాయతీ పరిధిలో తనిఖీల సమయంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోగా వీరు పాత కేసులో నిందితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు గా వివరిస్తూ పట్టుబడిన ముద్దాయిలు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితో పాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి లు, వీరి వద్ద నున్న 4 కేజీ ల గంజాయి ని కూడా స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాం, గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాం అని హెచ్చరిస్తూ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :