Thursday, 30 July 2026 10:34:09 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గంజా కేసు లో పరారీ లో నున్న నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్, కేజీ గంజాయి స్వాధీనం.

గంజా విక్రయదారులపై పి.డి. అక్ట్ నమోదు చేస్తాం - అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 11 April 2026 08:38 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండీ లక్ష రూపాయలు విలువచేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

గతంలో నమోదైన ఉల్లిపాయల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసు పాత కేసులో పరారీలో ఉన్న నలుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఈ నిందితులను శనివారం బసినికొండ పంచాయతీ పరిధిలో తనిఖీల సమయంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోగా వీరు పాత కేసులో నిందితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు గా వివరిస్తూ పట్టుబడిన ముద్దాయిలు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితో పాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి లు, వీరి వద్ద నున్న 4 కేజీ ల గంజాయి ని కూడా స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాం, గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాం అని హెచ్చరిస్తూ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :