నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో జల జీవన్ మిషన్ లో 90 వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు అయింది. గురువారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్, జల్జీవన్ మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ సంజయ్, బోర్ మెకానిక్ మాధవరెడ్డి ,టిడిపి నాయకుడు నరసింహులు ట్యాంకు నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. తంబళ్లపల్లె నూతన సచివాలయం సమీపంలోని పాత ట్యాంకు స్థానంలోనే కొత్త ట్యాంకు నిర్మాణం జరిగితే తంబళ్లపల్లె నియోజకవర్గం వర్గానికి తాగునీటి సరఫరా సులువుగా ఉంటుందని ఏఈఈ వినోద్ కుమార్ ధృవీకరించారు. స్థాయి ఎంపిక తర్వాత యుద్ధ ప్రాతిపదిక వాటర్ ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపడతామని విలేకరులకు తెలిపారు
Reporter
Namitha News