నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 16 : తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను తంబళ్లపల్లె మండలం టిడిపి నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ దయనీయ స్థితిలో ఉందని, పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగడంలేదని వాపోయారు. మండలంలో సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మీలాంటి నాయకుడు పార్టీకి అవసరమని కోరారు. ఆయన వెంట క్లస్టర్ ఇంచార్జ్ బేరీ శ్రీనివాసులు, రాజంపేట రైతు సంఘం నాయకుడు ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, బీసీ నాయకుడు పురుషోత్తం, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల్ రెడ్డి, గోపి దీన్నే హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, మాజీ సర్పంచులు సుధాకర్, శంకర్,సోమశేఖర్, వెంకటరమణ ఉన్నారు.
Reporter
Namitha News