నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 31 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత సురేష్ కుమార్, ప్రిన్సిపాల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డైరెక్టర్, కిండ్రిల్, బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న తాజా టెక్నాలిజీ పై విద్యార్థులు అవగాహాన పెంచుకోవాలని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు – విద్యార్థుల సిద్ధత అనే అంశంపై అవగాహన కల్పించారు. కోడింగ్ నైపుణ్యాలతో పాటు విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కరణ, బాధ్యత, అనుకూలత మరియు జట్టు సహకారం వంటి గుణాలు అవసరమని అన్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం, గ్రూప్ డిస్కషన్లలో పాల్గొనడం, ఫారెన్ ల్యాంగ్వేజ్స్ నేర్చుకోవడం మరియు కొత్త ఆవిష్కరణల కోసం అధ్యాపకుల మార్గదర్శకత్వం తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు మైక్రోసాఫ్ట్ టూల్స్, క్లౌడ్ కంప్యూటింగ్ (Azure), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో లోతైన జ్ఞానం పొందగలుగుతారు. ప్రాజెక్టులు, హ్యాకథాన్ల ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందటంతో పాటు, నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి అని అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్స్ ద్వారా మెంటోరింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు స్టూడెంట్స్ క్లబ్ ద్వారా అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ రంగంలో ఎదగడానికి మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ గొప్ప మార్గదర్శిగా నిలుస్తుంది అని అన్నారు. ప్రతి విద్యార్ధి జాబ్ కావాలంటే లెర్న్, అడాప్ట్, స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలిటీలు తప్పనిసరని ఆమె అన్నారు. ప్రాంప్ట్ కంప్యూటింగ్ స్కిల్స్ పై శ్రద్ధవహించాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన “ది లాస్ట్ పఫ్” అనే అవగాహన షార్ట్ ఫిల్మ్ను విడుదల చేశారు. ఈ చిత్రం ధూమపానం మరియు మద్యపానం వల్ల కలిగే హానికర ప్రభావాలను ప్రతిబింబిస్తూ, సమాజానికి మంచి సందేశాన్ని అందించారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ దినేష్, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు, కన్వీనర్ డాక్టర్ ఎస్. ఝాన్సీ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News