Thursday, 30 July 2026 09:57:45 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల అల్యూమిని మీట్

Date : 11 April 2026 08:44 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మరియు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల అల్యూమిని మీట్ కార్యక్రమమును నిర్వహించారు. మిట్స్ యూనివర్సిటీ నందు 2006-2010 వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఆత్మీయoగా ఒకరిని ఒకరు కలుసుకుని ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలోవైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు వారి ప్రతిభ, కృషితో పరిశ్రమల్లో ఉన్నత స్థానాలను సంపాదించడం మిట్స్ యూనివర్సిటీకు గౌరవాన్ని తీసుకువచ్చిందని అన్నారు. మీరు చదివిన కాలంలో మెకానికల్ విభాగంలో సదుపాయాలు పరిమితంగా ఉన్నా, పట్టుదలతో సవాళ్లను అధిగమించి విజయాన్ని సాధించడం గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీ నందు ఉన్న ఆధునిక ల్యాబ్స్, CNC మెషీన్స్, CAD/CAM, 3D ప్రింటింగ్ వంటి సదుపాయాలు చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీ 4.0 ప్రభావంతో ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి రంగాల్లో మెకానికల్ ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉందని, CAD/CAM, 3D ప్రింటింగ్, CNC మెషీనింగ్ వంటి ఆధునిక తయారీ సాంకేతికతలు పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడానికి , ఉద్యోగ అవకాశాలకు,ఇంటర్న్షిప్స్కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :