నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సహకారం అందించాలని ఎంపీడీవో ఉషారాణి కోరారు. ఈ సందర్భంగా అధికారులతో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో యోగా నిర్వహణకు అధికారులు, విద్యార్థులు,ప్రతి ఒక్కరు హాజరు కావాలని సూచించారు. యోగ నిర్వహణ ఏర్పాట్లను డిప్యూటీ ఎంపీడీవోలు, తంబళ్లపల్లె కార్యదర్శి లు పర్యవేక్షించాలన్నారు.ఈ సమీక్షలో ఏవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, కస్తూరిబా ప్రిన్సిపాల్ రేష్మ, పీఈటీలు ,ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News