నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 ః రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలు పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గురు ప్రసాద్, కార్యదర్శి గంగయ్య గౌడ్, ఉమా శంకర్, ధర్మయ్య, కిరణ్ కుమార్, రఫీ, శ్రీనివాసులు, ప్రవీణ్, బాబు, యుగంధర్, చాముండేశ్వరి, పద్మజలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని కలసి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక అంశాలు, తమ సమస్యల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి ఇది మంచి ఆలోచన, చాలా బాగా పనిచేశారు మీ రాష్ట్ర అధ్యక్షులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అని తప్పకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిలు, సమస్యలపై ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News