నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణమని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన ఒక్కో విద్యార్థికి ₹50,000 చొప్పున మొత్తం ₹3,00,000 రూపాయల స్కాలర్షిప్స్ లభించాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి ఉన్నత విద్యలో ఆటంకాలు కలగకుండా చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందిస్తోంది. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, సీనియర్ మేనేజర్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ అథాహర్ సమీనా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News