Sunday, 02 August 2026 03:39:48 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం

Date : 01 August 2026 07:27 PM Views : 21

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం - 14వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తోందని టిడిపి నేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు శనివారం 14వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయ సిబ్బందితో కలిసి ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.ఎన్టీఆర్ భరోసాతో అవ్వ తాతలు,వికలాంగులు,ఒంటరి మహిళలు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు,అన్నదాత సుఖీభవతో రైతులకు,స్త్రీ శక్తితో మహిళలకు,తల్లికి వందనంతో విద్యార్థులకు,ఎన్టీఆర్ గృహకల్పతో మధ్యతరగతి వారికి,అన్న క్యాంటీన్లతో నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఏపీ,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కొనియాడారు.కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :