Thursday, 30 July 2026 07:18:00 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గుండ్ల పల్లెలో దళితుల భూముల ల్యాండ్ డెవలప్మెంట్

50 ఎకరాలు బంజరు సాగు భూములయ్యాయి

Date : 23 March 2026 08:39 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 23 ః తంబళ్లపల్లె మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా దశాబ్దాలుగా బంజరు భూములుగా మిగిలిన దళితుల భూములను సాగు భూములగా మారి వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఏడాది క్రితం మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో దళితుల భూములు రికార్డులలో భూములు రాళ్లు గుట్టలు తప్ప సాగుభూమి లేకపోవడంతో దళిత రైతులు వ్యవసాయం లేక కూలీలకే పరిమితమయ్యారు. ఈ సమస్య పరిష్కారం లో భాగంగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఆధ్వర్యంలో దళితుల భూముల సాగులోకి తేవడానికి ఏపీఎఫ్ ఫౌండేషన్ సహకారంతో శ్రీకారం చుట్టారు. ఏడాదిగా గుండ్లపల్లి దళితవాడ కు చెందిన 50 మంది రైతుల 50 ఎకరాలు భూములను గుర్తించి వారి భూములను సాగు లోకి తేవడానికి నిరంతర కృషి చేశారు. గత రబీ సీజన్లో ల్యాండ్ డెవలప్మెంట్లో సాగులోకి తెచ్చిన భూములలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన తోబాటు వారికి అన్ని రకాల విత్తనాలను సైతం ఉచితంగా సరఫరా చేసి వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. నేడు ఆ భూముల్లో దళిత రైతులు ఉలవలు, వేరుశనగ, మొక్కజొన్న, కంది, సజ్జ,చిరుధాన్యాలు, పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేసి లబ్ధి పొందుతున్నారు. ఈ విషయమై ల్యాండ్ డెవలప్మెంట్ లో లబ్ధి పొందిన దళిత రైతులు వేటా మల్లికార్జున, లక్ష్మయ్య, సిద్ధప్పలు మాట్లాడుతూ మాకు పోర్డు సంస్థ డైరెక్టర్ జె.లలితమ్మ, ప్రతినిధి రమణ ద్వారా భూమి సాగులోకి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :