నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 22 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు గణిత శాస్త్ర విభాగము వారు ఆదర్శనీయుడు శ్రీనివాస రామానుజన్ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ కె కొమరగిరి మరియు మ్యాథమెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ పి.రమేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గణిత శాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. గణితశాస్త్ర పితామహుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలన్నారు. గణితం సైన్స్ అండ్ టెక్నాలజీకి మూలస్తంభం అని, మానవ నాగరికత పురోగతికి కూడా గణితం కొంతవరకు కారణమని చెప్పొచ్చు అని అన్నారు. న్యూమరాలజీ వంటి అనేక ఆధునిక ఉపన్యాసాలు గణితశాస్త్రంలో కూడా ఉన్నాయి. ఈ ఘనత శ్రీనివాస రామానుజన్కే చెందుతుంది అని అన్నారు. డిసెంబర్ 22న ఆయన జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు అని, ఆర్యభట్ట, మహావీర, బ్రహ్మగుప్త, భాస్కర 2, శ్రీనివాస రామానుజన్ వంటివారు గణితశాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం, అమోఘం అన్నారు. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్య్ జీనియస్ (Maths Genius)గా చరిత్రలో నిలిచి పోయారు అని అన్నారు. ఆయన జీవితం ఆధారంగా ‘ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ’ (The man who know infinity) పేరుతో సినిమా కూడా వచ్చింది అని అన్నారు. విద్యార్థులు గణిత శాస్త్రం పై పట్టు సాధించాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యకమం లో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News