Sunday, 21 June 2026 07:08:15 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి

Date : 19 June 2026 10:22 PM Views : 32

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 ః ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ తాగునీటి సరఫరా పైప్ లైన్ పనులను అడ్డుకోరాదని ఈ సత్కార్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ.ఈ చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం మండలంలోని కోటకొండ నుండి మండెంవారిపల్లెకు జలజీవన్ లో వేస్తున్న పైప్ లైన్ పనుల కాంట్రాక్టర్లను కొంతమంది రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న డి ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి హుటాహుటిన ఎఈఈలు దినేష్ కుమార్, వినోద్ కుమార్, డిపిఎం సంజయ్, జగన్నాథం, సైట్ ఇంజనీర్లతో సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత అడ్డుకున్న రైతులతో మాట్లాడారు. జలజీవన్ తాగునీటి పథకం పై వారికి అవగాహన కల్పించి ఇలాంటి మంచి కార్యక్రమాలను అడ్డుకోరాదని చెప్పడంతో రైతులు చైతన్యం చెంది సంఘీభావం తెలపడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా డి ఈ ఈ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పనులు త్వరగా పూర్తయితే ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందుతాయని ప్రజలు సైతం ఈ కార్యక్రమానికి సహకరించాలని సూచనలు చేశారు. అనంతరం మండలంలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి చొరవ చూపాలని ఏఈఈ వినోద్ కుమార్ కు సూచించారు. తీవ్రంగా తాగునీటి సమస్యలుంటే యుద్ధ ప్రాతిపదికన వాటర్ ట్యాంకర్ల ల తో నీరు తరలించి సమస్య పరిష్కరించాలన్నారు. అదేవిధంగా మండలంలో ప్రారంభమైన జలజీవన్ మిషన్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలు నాణ్యత లోపం లేకుండా త్వరగా పనులు జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట కోటకొండ పంచాయతీలోని అధికార పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: