Thursday, 30 July 2026 08:18:13 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రజలు మెచ్చిన జగన్ మళ్ళీ సియం కావాలని పాలేటమ్మకు మొక్కు - నిసార్ అహమ్మద్

Date : 03 June 2026 06:24 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పాలేటి గంగమ్మ తల్లి అనుగ్రహంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం కావాలి... ప్రజలు మెచ్చిన పరిపాలన రావాలి.... జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు పాలేటి గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి -- పాలేటి గంగమ్మ తల్లి జాతర ప్రత్యేక పూజలలో పాల్గొన్న మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మదనపల్లె నియోజకవర్గం మదనపల్లె మండలం చిప్పిలి జరుగుతున్న పాలేటి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా మదనపల్లె YSRCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొన్నారు. చిప్పిలి గ్రామస్థులు, స్దానిక YSRCP నాయకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేసినారు. నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ పాలేటి గంగమ్మ తల్లి అనుగ్రహం ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం కావాలని, ప్రజా ప్రభుత్వం వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు పాలేటి గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు నిస్సార్ అహమ్మద్ తెలిపారు. పాలేటి గంగమ్మ తల్లి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సంవృద్దిగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పూజ కార్యక్రమాల అనంతరం కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, చిప్పిలి మల్లికార్జున రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు స్వగృహాలకు వెళ్ళి వారి ఆతిధ్యం స్వీకరించారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు YSRCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :