నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు కనపడరాదని విఆర్వో వెంకటరమణ పెట్రోల్ బంక్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆయన మండల కేంద్రంలోని రెండు పెట్రోల్ బంకులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ బంకులోతనిఖీలో నార్మల్ పెట్రోల్ 9978 లీటర్లు, పవర్ పెట్రోల్ 3995 లీటర్లు, డీజల్ 5860 లీటర్లు స్టాకు ఉన్నట్లు గుర్తించారు. మండలంలోని రైతులకు, వినియోగదారులకు సకాలంలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట పోలీస్ కానిస్టేబుల్ రవి నాయక్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News