నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : మదనపల్లి మున్సిపాలిటీ, భవిష్యత్తులో జీతాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి పుంగనూరు మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముభారక్, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు ఆ మేరకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, భవిష్యత్తులో సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో 2025 ఏప్రిల్ నెలలో డిసెంబర్ 2026 లో జనవరి నెలలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.పుంగనురు మున్సిపల్ డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికులు కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు రోజూ పట్టణ శుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘననే అన్నారు.పారిశుద్ధ్య కార్మికులు వేతనాలపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంద్రాణి, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులు అన్నపూర్ణ, శ్రీదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News