నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 15 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా శనివారం మండలంలోని రేణుమాకులపల్లి పంచాయతీలో వైకాపా నాయకుడు సంతకాల సేకరణ చేపట్టారు. ఉదయం మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు రేణుమాకులపల్లి పంచాయతీలోని గ్రామాలలో ముమ్మరంగట పర్యటించి నేటి కూటమి ప్రభుత్వం వైపల్యాలను ఎండ గడుతూ గత పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలీ , శ్రీరాములు, తాళ్ల చంద్రశేఖర్, పాపి నాయుడు, ఎంపీటీసీలు కరీముల్లా, మహేష్, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాంబశివారెడ్డి, శ్రీరాములు, రామ్మూర్తి, వెంకటరమణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News