Thursday, 30 July 2026 08:11:10 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు

పేద,మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు కంకణం కట్టుకున్న కాళకూటమి ప్రభుత్వం - సిపిఐ

Date : 14 January 2026 10:58 AM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జనవరి 14 : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ (పిపిపి) పేరుతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుని 590,847 జీవోలను తీసుకువచ్చిందని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భోగి పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం ఐదు గంటలకు స్థానిక పిటిఎం రోడ్డు నందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగిమంటలను వేసి అందులో 590,847 జీవో ప్రతులను దగ్ధం చేశారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం మానుకోవాలని,తక్షణం ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని,పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం మానుకోవాలని,పిపిపి విధానాన్ని రద్దు చేయాలని,ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలని,కూటమి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ; నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు కోసం భూములు,భవనాల నిర్మాణం,వనరులు,మౌళిక సదుపాయాలతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ప్రభుత్వమే చెల్లించి కళాశాలల నిర్వహణను మాత్రం పిపిపి పేరుతో ప్రైవేటుకు అప్పగించడం ఎంతవరకు సబబో ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు మొండిగా వ్యవహరించడం చూస్తుంటే ఇది "కూటమి ప్రభుత్వం" కాదని ఇది "కాళకూటమి ప్రభుత్వమని" ఘాటుగా విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎస్. తంబయ్యశెట్టి,ఎం.అష్రఫ్అల్లీ,పి.మంజునాథ్,జి. నారాయణస్వామి,ఎం. గంగులప్ప,హబీబ్, రామచంద్ర,షఫీ,రెడ్డప్ప, గంగాధర్,కిట్టన్న, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: