నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 27 : తంబళ్లపల్లె మండలం బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీ బలకవారిపల్లె లో మల్లమ్మ నిరుపేద వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొంది శుక్రవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న టిడిపి పార్లమెంటు రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి మల్లమ్మ మృతిపై సంతాపం ప్రకటించి దహన క్రియలకు ఆమె కుమార్తె మల్లేశ్వరి కి రూ 5వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, వై శ్రీనివాస్ రెడ్డి, ఎన్ అప్ప స్వామి రెడ్డి, ఎన్ భాస్కర్ రెడ్డి, డి రాజారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News