నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 23 ః తంబళ్లపల్లె మండలం లో జరిగిన ఉపాధి హామీ కరువు పనులపై ఏపీవో అంజనప్ప సూచనల తో డిఆర్పిలు అనిల్, శ్రీనివాస్ నాయకులు ముమ్మరంగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. గత మూడు రోజులుగా డిఆర్పిలు గ్రామాలు చేపట్టిన ఇంకుడు గుంతలు, పండ్ల తోటల పెంపకం, పశుగ్రాసం పెంపకం, మొక్కలు పెంపకం, పశువుల నీటి తొట్టెలు, గోకులాలు, తదితర ఉపాధి హామీ లో చేపట్టిన పనులను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలు నిర్వహించి చేసిన ఉపాధి హామీ పనులు వాటి వల్ల ఉపయోగం, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ప్రజలు, కూలీలతో సమీక్షించి వారి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ గ్రామ సభలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది, ఉపాధి కూలీలు, ప్రజలు హాజరవుతున్నారు.
Reporter
Namitha News