Thursday, 30 July 2026 08:15:53 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అన్నమయ్య జిల్లా ఏఆర్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏడుకొండల రెడ్డి

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి

Date : 25 January 2026 02:00 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25: అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డిఎస్పీ గా డి. ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మదనపల్లి లోని డిఎస్పీ కార్యాలయం లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారికి పుష్పగుచ్ఛం అందజేసి, మర్యాదపూర్వకంగా కలిశారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఆర్ డిఎస్పీ గారికి ఎస్పీ గారు పలు కీలక సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు సాయుధ దళ విభాగంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అత్యున్నత స్థాయి క్రమశిక్షణను పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఏఆర్ విభాగంలో పనిచేసే సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సిబ్బందికి నిరంతరం వృత్తిపరమైన శిక్షణ అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులకు ఏఆర్ విభాగం పూర్తిస్థాయిలో సమన్వయం అందిస్తూ మద్దతుగా నిలవాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

అనంతరం ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా, క్రమశిక్షణతో కూడిన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :