నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 26 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం మూడవ సంవత్సరం విద్యార్థి, చిత్తూర్ 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీకి చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ (JUO) కె. రేవంత్ కుమార్, చిత్తూరు లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక “సీడబ్ల్యూఎస్ బెస్ట్ క్యాడెట్ ఆఫ్ ది ఇయర్ 2025-26” పురస్కారం లభించిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అవార్డును చిత్తూరు 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ ప్రదానం చేశారు. Chittoor లో జరిగిన కఠినమైన శిక్షణను పూర్తి చేసి ఫైరింగ్, డ్రిల్, ఇంటర్వ్యూ మరియు సాధారణ జ్ఞానంపై రాత పరీక్ష వంటి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, వివిధ యూనివర్సిటీ ల మరియు కళాశాలల నుండి పాల్గొన్న పోటీదారులలో ఉత్తమ క్యాడెట్గా ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కె. రేవంత్ కుమార్ కు రూ. 4,500 నగదు బహుమతిని కూడా అందజేశారు. ఉత్తమ ప్రదర్శన చూపిన యెన్ సి సి క్యాడెట్ ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సల్లర్ డాక్టర్ యెన్ Vijaya భాస్కర్ చౌదరి, ప్రో చాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యెన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News