నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 24 : రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామ అయ్యప్ప భక్తులు మాలధరించిన స్వాములు శబరిమలైకు సోమవారం బయలుదేరారు. 41రోజులు మండల దీక్ష చేసి స్వామి దర్శనం కోసం బయలుదేరారు. వీరికి గురుస్వామి రెడ్డెప్ప అయ్యప్ప స్వాములకు నియమ నిష్టలతో ఇరుముడి కట్టి సుమారు 20మంది స్వాములకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి స్వాములకు కొబ్బరికాయలో నెయ్యి, బియ్యం పూజ సామాగ్రిలు వేసి నల్లటి వస్త్రంలో ఇరుముడి కట్టి అయ్యప్ప స్వాములు శబరి మలైకి బయలుదేరిన స్వాములు గురుస్వామి మునిబోయిన రెడ్డెప్ప, మంజునాథ్, వి ఆర్ ఏ హరినాథ్,కృపాకర్,శివాచారి, హరీష్,వెంకటరమణ గౌడ్, తిరుపతినాయుడు, చిన్ని, సుబ్రహ్మణ్యం, మోహన్ కుమార్, ఊటుగొల్లపల్లె శ్రీనాథ్ ప్రభాకర్,హరి తదితరులు స్వామి దర్శనం కోసం తరలివెళ్లారు.
Reporter
Namitha News