నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 ః రౌడీలు, డిసీలు, సస్పెక్ట్స్ సత్ప్రవర్తన కట్టు తప్పితే కఠిన చర్యలు తప్పవని తంబళ్లపల్లె ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లు, డీసీలు, సస్పెక్ట్స్ లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని చెడు నడవడిక కలిగిన వారిపై సదా పోలీసు నిఘా ఉంటుందని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఉపేక్షించమని ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, రాఘవేంద్ర, శివ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News