Thursday, 16 April 2026 04:22:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ఘనస్వాగతం పలికిన డాక్టర్ స్వాతి చక్రపాణి

Date : 14 January 2026 05:41 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు... - ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ఘనస్వాగతం పలికిన డాక్టర్ స్వాతి చక్రపాణి ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమం నందు బుధవారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సంబరాలకు మదనపల్లి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.ముందుగా భోగి మంటతో కార్యక్రమాన్ని ప్రారంభించి,వృద్ధులతో ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్వదినాలు భారతదేశ సంస్కృతి,సాంప్రదాయాల విశిష్టతను చాటుతున్నాయన్నారు.ముఖ్యంగా ధాత్రి ఆనంద నిలయంలో అన్ని పర్వదినాల నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఆనంద నిలయం అలసిన వృద్ధ జీవితాల ప్రేమాలయమని,వ్యవస్థాపకులు స్వాతి చక్రపాణి చూపిస్తున్న ఆప్యాయత వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.హిందూ పర్వదినాలలో సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైందన్నారు.మూడు రోజులపాటు భోగి,మకర సంక్రాతి,కనుమలను నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు.వృద్ధుల ఆలనా పాలన చూస్తున్న స్వాతి చక్రపాణి సేవలను ప్రశంసించారు.భవిష్యత్తులో ఆనంద నిలయం అభివృద్ధికి తనవంతు సహాయ,సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం స్వాతి చక్రపాణి మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు సంక్రాంతికి సంబరాలకు హాజరైన ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.దాతల సహకారంతో ధాత్రి ఫౌండేషన్,ఆనంద నిలయం ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.తమ సంస్థ సేవా కార్యక్రమాలలో దాతలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నవీన్ చౌదరి,టిడిపి పట్టణ ఉపాధ్యక్షులు యర్రబల్లి వెంకటరమణారెడ్డి,టిడిపి కోళ్లబైలు ఇంచార్జి రాటకొండ శ్రీనివాసులు నాయుడు,33వ వార్డు ఇంచార్జి రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),డి.రమేష్ రెడ్డి,కత్తి లక్ష్మన్న,చుక్కా విజయ్ కుమార్,నాగమణి,లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మురళి,ఉపాధ్యాయుడు బి.వి.రమణ మరియు ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :