నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని స్పెషల్ ఆఫీసర్, జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికార యంత్రాంగం తో ఎంపీడీవో కార్యాలయం నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్యం పాటించి గ్రామాల్లో సేకరించిన తడి పొడి చెత్తతో ఎరువు తయారీ చేసి ఆదాయ వనరుగా మార్చాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తామని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి,ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు మారుతీ కుమార్, ప్రసాద్, ఏఈలు వినోద్ కుమార్, వెంకటరమణ, సుజాత, కార్యదర్శి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు నరసింహులు, ఉపాధి ఈసి మహేష్, ఉపాధి హామీ, ఐకెపి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Reporter
Namitha News