నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 ః తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో కోటి నిధులతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టిడిపి నాయకులు నర్సింహులు, రషీద్ భాషా, ఐసుల కిట్ట లు తెలిపారు. తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్, సాలెవీధి, శ్రీనివాసకాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువ పనులు ముమ్మరంగా జరిగి పూర్తి కావస్తున్నట్లు కాంట్రాక్టర్లు రవీందర్ రెడ్డి, సూర్య ప్రకాశ్ రెడ్డి లు తెలిపారు. దశాబ్దాలుగా ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ రోడ్డు ఇరుకుగా ఉండగా జిల్లా కలెక్టర్ సందర్శించి రోడ్డు వెడల్పుకు ఆదేశించగా నేడు అయిదున్నర మీటర్లు వెడల్పుతో విశాలంగా సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మాణంతో స్థానిక అధికారులు, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు
Reporter
Namitha News