నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 06 : ప్రభుత్వం ఇచ్చిన హామీలు భాగంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు జరిగింది. ఇందుకు కృతజ్ఞతలు చేనేత కార్మికులు బుధవారం కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఉదయం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బిజెపి సీనియర్ నాయకుడు మగ్గాలు లక్ష్మయ్య, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి,చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శినాగార్జున,చేనేత సంఘ మండల అధ్యక్షుడు రేపన మల్లికార్జున, సాంబశివారెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి చేనేత కార్మికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండి డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి పనులతో పరుగులు పెడుతోందని ప్రశంసించారు. మండలంలో సుమారు 74 మంది చేనేత కార్మికులు, 12 మంది మరమగ్గాల లబ్ధిదారులకు ఉచిత విద్యుత్తు ఆందుతోందని కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎల్ఐ భాస్కర్, లైన్మెన్ శంకర్, టిడిపి నాయకులు పురుషోత్తం, కాల మాజీ జడ్పీటీసీ రామచంద్ర, మ్యూజికల్ శివ, మధు నాయుడు, దండు రమణ, బిజెపి నాయకులు శంకర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, జనసేన నాయకులు బండి మురళీకృష్ణ, రాజారెడ్డి, చేనేత కార్మికులు నరసింహులు, రాజా రమేష్, వెంకటరమణ, శివశంకర్, నరసింహారెడ్డి, మధుకర్ రెడ్డి, జయరాం తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News