నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 2 9 ః విద్యార్థులు ఈ దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జ్ ఉమర్ ఫరూక్ సూచించారు. శనివారం హైస్కూల్లో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సు లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. పిల్లలు పాఠ్యాంశాలతో పాటు వార్తా పత్రికలు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. మండల న్యాయ సేవా సంఘం ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News