నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 : లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సంచరించిన మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే ఉపేక్షించేది లేదని ఘాటుగా స్పందిస్తామని మహిళలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ముందు ధీమాగా చెప్పారు. సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పరసతోపు పంచాయతీ బోయపల్లిలో ప్రజలు, మహిళలకు అభివాదం చేస్తూ పేరుపేరునా పలకరిస్తూ రచ్చబండ చేరుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అందరికీ దేవుడుగా నిలిచిన మహాశివుడు స్థిరపడిన కొండల్లో ఖనిజాల అన్వేషణ చేస్తే అడ్డుకుంటామని భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పర్యావరణంతో శివార్లలోని పల్లె సీమలు బుగ్గి పాల వుతాయని కొండలను కాపాడుకోవడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాతిరెడ్డి మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన సాధు, ఇనుము, మల్లయ్య కొండల సమాహారం దైవాంశ సంభూతమని ఇలాంటి కొండలలో మైనింగ్ చేపడితే పర్యావరణంతో పాటు భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మికత,దైవత్వాన్ని, స్థానిక అచ్చులాధి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని తెలిపారు. ముల్లయ్య కొండల మహా శివుని ఆలయాల సంరక్షణ కోసం పార్టీలకతీతంగా రైతులు, కూలీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,శివ భక్తులు, ప్రజలు ప్రతి ఒక్కరు వ్యతిరేకించక తప్పదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు పవిత్రమైన మల్లయ్య కొండల జోలికి రాకుండా శాశ్వత మైనింగ్ రహిత ప్రాంతంగా ప్రకటించి మల్లయ్య కొండల అభివృద్ధికి సహకరించి లక్షలాదిమంది సేవించే ఆ మల్లయ్య కొండ మహాశివుని భక్తుల మనోభావాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఆయన వెంట మహిళలు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News