Wednesday, 17 June 2026 02:38:00 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం!

ఎమ్మెల్యే తో రచ్చబండలో మహిళలు హామీ!

Date : 15 June 2026 09:39 PM Views : 36

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 : లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సంచరించిన మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే ఉపేక్షించేది లేదని ఘాటుగా స్పందిస్తామని మహిళలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ముందు ధీమాగా చెప్పారు. సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పరసతోపు పంచాయతీ బోయపల్లిలో ప్రజలు, మహిళలకు అభివాదం చేస్తూ పేరుపేరునా పలకరిస్తూ రచ్చబండ చేరుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అందరికీ దేవుడుగా నిలిచిన మహాశివుడు స్థిరపడిన కొండల్లో ఖనిజాల అన్వేషణ చేస్తే అడ్డుకుంటామని భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పర్యావరణంతో శివార్లలోని పల్లె సీమలు బుగ్గి పాల వుతాయని కొండలను కాపాడుకోవడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాతిరెడ్డి మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన సాధు, ఇనుము, మల్లయ్య కొండల సమాహారం దైవాంశ సంభూతమని ఇలాంటి కొండలలో మైనింగ్ చేపడితే పర్యావరణంతో పాటు భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మికత,దైవత్వాన్ని, స్థానిక అచ్చులాధి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని తెలిపారు. ముల్లయ్య కొండల మహా శివుని ఆలయాల సంరక్షణ కోసం పార్టీలకతీతంగా రైతులు, కూలీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,శివ భక్తులు, ప్రజలు ప్రతి ఒక్కరు వ్యతిరేకించక తప్పదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు పవిత్రమైన మల్లయ్య కొండల జోలికి రాకుండా శాశ్వత మైనింగ్ రహిత ప్రాంతంగా ప్రకటించి మల్లయ్య కొండల అభివృద్ధికి సహకరించి లక్షలాదిమంది సేవించే ఆ మల్లయ్య కొండ మహాశివుని భక్తుల మనోభావాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఆయన వెంట మహిళలు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :